ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, పాములపాడుకు చెందిన సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి గత 23 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ, అందరికీ ఆదర్శవంతమైన మంచి వార్త కథనాలు రాస్తున్నందుకు "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025" కు జర్నలిస్టు సంఘాల నాయకులు తుపాకుల. రమేష్, చంద్రశేఖర్, వీరేష్ లు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు చీఫ్ ఎడిటర్ తుపాకుల. రమేష్, ఎడిటర్ చంద్రశేఖర్, ఇన్చార్జి వీరేష్, తదితర నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు చెందిన సయ్యద్. షర్ఫద్దీన్ అలి గత 23 సంవత్సరాలుగా వివిధ పత్రికలలో, చానల్స్ లో మండల విలేఖరిగా చేరి, నియోజకవర్గ ఇన్చార్జ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్చార్జిగా, ఇప్పుడు సబ్ ఎడిటర్ గా పనిచేయడం గర్వకారణం అన్నారు. స్థానిక, దేశ, విదేశాల వార్తలు, కవితలు, అన్యాయాలకు, మానవత్వానికి, మతసామరస్యానికి సంబంధించిన వార్తలు రాయడం ఆయన హాబీ అని అన్నారు. ఆయన వార్త కథనాల ద్వారా రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, మేధావులు గల్లి నుండి రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా అందరికీ సంబంధించిన వివిధ రకాల వార్తలు రాసి అందరి ఆదరాభిమానాలు పొందడం జరిగిందన్నారు. ఈరోజు కర్నూలు పట్టణంలోని, సి. క్యాంపు సెంటర్లో ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి విలేకరుల సమావేశంలో సబ్ ఎడిటర్-ఎస్.షర్ఫద్దీన్ అలి కి శాలువా కప్పి, సర్టిఫికెట్ చేతికి అందించి, ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు కే.నాగన్న, రాఘవేంద్ర, నారాయణస్వామి, జె.నాగరాజు, కే.అంకన్న, కుందు.లక్ష్మన్న,చంద్ర, రాముడు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News