Friday, 11 September 2026 09:30:39 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

బాలికల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి:- శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

Date : 08 August 2026 11:37 PM Views : 106

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రాష్ట్రంలో బాలికల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కృషి చేస్తోందని శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. శనివారం ఆత్మకూరులోని, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆయన, విద్యార్థినులకు అవసరమైన నిత్యోపయోగ వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ట్రంక్ బాక్స్, ప్లేట్, గ్లాస్, బెడ్ షీట్, కార్పెట్, టర్కీ టవల్, స్వెట్టర్, నైట్ డ్రెస్ తదితర ముఖ్యమైన వస్తువులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు తన సొంత నిధులతో త్వరలోనే మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ "విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవరచుకుని, పట్టుదలతో విద్యను అభ్యసించాలి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించడం ద్వారా తమ తల్లిదండ్రులకు, చదువుకున్న వసతి గృహానికి మరియు శ్రీశైలం నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బేబీ, ఎంఈవో -2 ఆయుబ్, సహాయ సాంఘీక సంక్షేమ అధికారి కేసీ రాముడు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. అంజన్న, సుధారాణి, రాజు, రాజారావు, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలీముల్లా, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నజీర్,మండల పార్టీ అధ్యక్షలు రవీంద్ర బాబు, క్లస్టర్ ఇంచార్జ్ రాజారెడ్డి, దినకర్ నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, నాఘుర్ ఖాన్, కొప్పరపు రవి ప్రసాద్, శరత్, నబీ, సుల్తాన్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :