Wednesday, 29 July 2026 06:28:12 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు లింగాల నాగరాజు

Date : 20 November 2025 10:14 PM Views : 1089

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- ఎల్.నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కే.నాగన్న తో కలిసి సందర్శించి మాట్లాడుతూ సోమవారం మొదులుకొని శుక్రవారం వరకు రోజు ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వకుండా పిల్లల నోర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెరుగుకు బదులు పలచని మజ్జిగ పోస్తున్నారని పిల్లలు పలచటి చారు, పెరుగుకు బదులు పలచని మజ్జిగ పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏది సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. నాలుగు బాత్రూములు ఉంటే రెండు బాత్రూంలలో మాత్రమే నీరు వస్తుందని, 9 రూములలో ఒక్క రూములో మాత్రమే కరెంటు ఉందని, ఆ రూములోనే పిల్లలందరూ రాత్రివేళ నిద్రించడానికి సరైన సౌకర్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ కు రావడం లేదని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల బాగా చదువుకుంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎవరు ప్రశ్నించరని వార్డెన్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా, సరిగ్గా చూసుకోకపోయినా వార్డెన్లను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :