ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, అన్ని గ్రామాలలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఎంపీపీ- టి.సరోజిని వర్జినియా, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ఈ.వి.నాగలక్ష్మి దేవి, డాక్టర్ ఎం.మొహమ్మద్ బేగ్, సిహెచ్ఓ జి.అన్నమ్మ, సూపర్వైజర్ ఏం.మద్దయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, సూపర్వైజర్ రత్నమ్మ, పద్మావతి, ఫార్మసిస్టు బి.మూసా సలాం, హెల్త్ అసిస్టెంట్ లు డి.రాములు నాయక్, ఎం.పుల్లయ్య, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, ఎంఎన్ఓ లు ఎన్.శాలు భాష, సి.హరికృష్ణ, ఎస్ఏడబ్ల్యు ఎన్.పుల్లయ్య, మండలంలోని ఎంఎల్ హెచ్పి లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ పాములపాడు మండలంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి మండలం మొత్తం 27 బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు ఒకటి మొబైల్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్ సెంటర్లో ప్రయాణికుల కోసం 27 నెంబర్ పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు గంగా, తదితర ప్రాంతాలలో పనులు చేస్తున్న కూలీల పిల్లల కోసం మొబైల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోలియో చుక్కలు ఈరోజు దాదాపు 95% వరకు పిల్లలకు వేయడం జరిగిందని, రేపు, ఎల్లుండి మిగతా తప్పిపోయిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి మా వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొత్తానికి అందరి సహకారంతో పాములపాడు మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది అన్నారు.
Admin
E Nivas News