Tuesday, 28 July 2026 08:28:32 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 23న ఆత్మకూరులో జరిగే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి

Date : 17 July 2026 09:36 PM Views : 127

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న, ఎన్టీఆర్ కె.వి.ఆర్. స్టేడియం నందు జూలై- 23 న తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి ఈ జాబ్ మేళాకు సంబంధించి మండల కేడీసీసీ సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, పట్టణ టిడిపి నాయకులు వేణు, టిడిపి మండల నాయకులు రవీంద్ర, మాజీ టీడీపీ మండల నాయకులు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మైనార్టీ నాయకులు నాగుర్, మాజీ టీడీపీ ఎంపీటీసీ లు లింగస్వామి, శ్రీను మిగతా టీడీపీ నాయకులు గోవర్దన్ రెడ్డి, శంకర్, దినకర్, గంగాధర్ రెడ్డి మరియు మండల టిడిపి నేతలు ఆత్మకూరు పట్టణంలోని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 10ప్రైవేట్ కంపెనీలు ఎస్ ఎస్ కె జి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మణిపాల్ సిగ్న ప్రైవేట్ లిమిటెడ్, హ్యుందాయ్ గ్లోవిస్, యూనికోసాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్, ఫోన్ పే, భారత్ ఫైనాన్స్ ఎంక్లూసన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ డిక్సెన్ టెక్నాలజీస్, సుజల పైప్స్ మరియు టాటా ఎలెక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు పదవ తరగతి పాసై, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బి/డి/ఎం ఫార్మసీ మరియు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కావున జిల్లాలోని, నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోగలరని తెలియ జేశారు. వీటికి సంబంధించిన ఇతర వివరముల కొరకు 9951400588, 9154830286 ఫోన్ నెంబర్లకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :