ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న, ఎన్టీఆర్ కె.వి.ఆర్. స్టేడియం నందు జూలై- 23 న తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి ఈ జాబ్ మేళాకు సంబంధించి మండల కేడీసీసీ సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, పట్టణ టిడిపి నాయకులు వేణు, టిడిపి మండల నాయకులు రవీంద్ర, మాజీ టీడీపీ మండల నాయకులు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మైనార్టీ నాయకులు నాగుర్, మాజీ టీడీపీ ఎంపీటీసీ లు లింగస్వామి, శ్రీను మిగతా టీడీపీ నాయకులు గోవర్దన్ రెడ్డి, శంకర్, దినకర్, గంగాధర్ రెడ్డి మరియు మండల టిడిపి నేతలు ఆత్మకూరు పట్టణంలోని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 10ప్రైవేట్ కంపెనీలు ఎస్ ఎస్ కె జి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మణిపాల్ సిగ్న ప్రైవేట్ లిమిటెడ్, హ్యుందాయ్ గ్లోవిస్, యూనికోసాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్, ఫోన్ పే, భారత్ ఫైనాన్స్ ఎంక్లూసన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ డిక్సెన్ టెక్నాలజీస్, సుజల పైప్స్ మరియు టాటా ఎలెక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు పదవ తరగతి పాసై, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బి/డి/ఎం ఫార్మసీ మరియు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కావున జిల్లాలోని, నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోగలరని తెలియ జేశారు. వీటికి సంబంధించిన ఇతర వివరముల కొరకు 9951400588, 9154830286 ఫోన్ నెంబర్లకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని తెలియజేశారు.
Admin
E Nivas News