ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ప్రజా అంకితం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలండర్లను నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి. అంకన్న ఆధ్వర్యంలో మండల కో ఆప్టెడ్ మెంబర్- సయ్యద్.ముర్తుజాఅలీ, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బి.సి. సెల్ అధ్యక్షుడు- ఎం.పీ.మద్దిలేటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు- ఎస్.షేక్షాఅలీ, కొత్తపల్లి వైఎస్ఆర్సిపి నాయకుడు ఈ.జగదీశ్వర్ గౌడ్, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల. అబ్రహం, న్యాయవాది బతుకులయ్య, మయూరి హోటల్ అధినేత మహేశ్వర్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ప్రసాద్, సోషల్ మీడియా ప్రతినిధి మౌలాలి, ఇతర సంఘాల నాయకులు మైమాకర్, పుల్లయ్య తదితరులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రిక మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన ప్రత్యేక వార్త కథనాలతో అందరినీ ఆకట్టుకొని అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తుందని అన్నారు. పల్లెల నుండి మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారాన్ని మన వరకు చేరవేసేటివే ఈ వార్త పత్రికలని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తాపత్రికలను ఆదరించాలని కోరారు.
Admin
E Nivas News