ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : అత్యవర వైద్యం కోసం అంబులెన్స్ రావాడం ఆలస్యమైతుందని, నల్లమల అటవీ ప్రాంతానికి అతిసమీపంలో ఉన్న కొత్తపల్లి మండలంలోని, ముసలిమడుగు గ్రామానికి చెందిన ఎమ్ఎమ్జీ అబ్దుల్లా అనే యువకుడు తన సొంత ఖర్చుతో 3 అత్యవసర ఆటోలు ఏర్పాటు చేశారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి ఎస్సై జయశేఖర్ చేతులమీదగా రిబ్బన్ కట్చేసి అత్యవర ఆటో సర్వీసులు ప్రారంభించారు. తన సహకారంతో గ్రామంలో ఒక ప్రాణం కాపాడిన చాలు అంటున్నాడు. అబ్దుల్లా లాగే గ్రామంలో బస్ సెల్టర్ లేక వర్షానికి, ఎండకు జనం ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో బస్సు షెల్టర్ నిర్మిస్తానని చెప్పారు. అత్యవస ఆటో ప్రారంభం చేయడంతో గ్రామ పెద్దలు ఆ యువకున్ని అభినందించారు.
Admin
E Nivas News