ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలో గతంలో రీ సర్వే జరిగిన గ్రామాలకు సంబంధించి తుమ్మలూరు గ్రామానికి కొత్తగా మంజూరైన 58 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు గ్రామ సచివాలయంలో ఈరోజు పంపిణీ చేస్తామని తహసిల్దార్ జి.సుభద్రమ్మ తెలియజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే/ ప్రాజెక్టులో భాగంగా నాలుగో విడత జూటూరు గ్రామంలో పెద్దల సమక్షంలో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ అందుబాటులో ఉండి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఐఓఎస్-ఉమాపతి, ఆర్ఎస్ డిటి-సుప్రియ, మండల ల్యాండ్ సర్వే ఆఫీసర్ కలిముల్లా, డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్- డి.ఖాజాబీ, వీఆర్వో లు, వి ఎస్ ఎస్ లు, గ్రామ పెద్దలు పూసల కృష్ణ, రైతులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News