ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోనీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జి.రత్న రాధిక, రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్- ఎస్.అబ్దుల్ కరీం లు స్వాతి కిరణం & మెట్రో ఆంధ్ర తెలుగు దినపత్రికల క్యాలెండర్లను నంద్యాల జిల్లా ఇంచార్జ్ ఎం.రాము గౌడ్, తదితర అధికారులతో, మీడియా ప్రతినిధులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా తహసిల్దార్- జి.రత్న రాధిక, డిపి- ఆంజనేయులు, సబ్ రిజిస్టార్- ఎస్.అబ్దుల్ కరీం లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం రాకముందు నుండి వార్తాపత్రికలు మారుమూల ప్రాంతాల నుండి ప్రపంచ దేశాల వరకు ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవస్తాయన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా వార్త పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలంటే, పై స్థాయికి ఎదగాలంటే పత్రికలే కీలకమన్నారు. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, విపత్తులు ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారం ఈ వార్త పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తా పత్రికలను ఆదరించాలని అప్పుడు అవి మన అభివృద్ధికి పూల బాటలు వేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతికిరణం & మెట్రో ఆంధ్ర నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎం.రాము గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధులు చంద్రశేఖర్, బిగ్ టీవీ న్యూస్ ఛానల్ విలేఖరి ఖాదర్ వలీ, విశాలాంధ్ర విలేఖరి హరీష్, రియల్ ఎస్టేట్ ఆకుల సలాం, మీడియా మిత్రులు పత్రికా విలేకరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News