Saturday, 12 September 2026 09:24:56 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన

Date : 31 July 2026 08:53 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లాలోని, పాములపాడు గ్రామానికి చెందిన రైతు కురువ ఎల్లయ్య మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన సర్వే నెం. 261లో 21 ఎకరాల 64 సెంట్ల భూమి మాత్రమే ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో 25 ఎకరాల 14 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారని తెలిపారు. అంతే కాకుండా, అదే సర్వే నంబర్‌లో 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేసి ఆన్‌లైన్ పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, సర్వే నెం. 43/3లో 50 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా, నేషనల్ హైవే రోడ్డులో 31 సెంట్లు భూసేకరణకు పోగా, మిగిలిన 19 సెంట్లు మాత్రమే ఉండాలి, కానీ రెవెన్యూ రికార్డుల్లో 29 సెంట్లు ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. ఈ కారణంగా ఆత్మకూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదని తెలిపారు. ఈ రెండు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ద్వారా ఫిర్యాదులు అందజేసినా, గత ఒక సంవత్సరం కాలంగా గ్రామ విఆర్ఓ, తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి పరిష్కారం లభించలేదని అన్నారు. సమస్యకు సంబంధించిన అన్ని సరైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధారాలు అధికారులకు పలుమార్లు చూపించినప్పటికీ సమస్యను పరిష్కరించడం లేదు. ప్రతి సారి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న కానీ, సమస్య పరిష్కారం కాకపోగా ప్రయాణ ఖర్చులు పెరుగుతున్నాయనీ అన్నారు. సమయం వృథా కూడా వృధా అవుతోందనీ అన్నారు. అయినప్పటికీ తమ సమస్యను అధికారులు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదన్నారు. అసలు సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదో కూడా తమకు తెలియడం లేదని కురువ ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ తప్పులను వెంటనే సరిచేసి, బాధ్యులపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను, రెవెన్యూ ఉన్నతాధికారులను రైతు కురువ ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :