ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, కొణిదెల గ్రామంలో, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులతో, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర. శివానందరెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కూటమి మద్దతుదారులు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ లుగా గెలుపొందేలా అంతా ఐక్యంగా కృషి చేయాలి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేసి అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలని మళ్లీ 2029 సార్వత్రికఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని అన్నారు. కొణిదెల గ్రామానికి 18 నెలల్లో సిసి రోడ్లు, వాటర్ ట్యాంక్, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూతాం ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, హరీష్ రెడ్డి, పోలీస్ రంగస్వామి, సాలె మహేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News