ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, అన్ని అన్ని పోలింగ్ కేంద్రాలలో తహసిల్దార్- జి.సుభద్రమ్మ, డిటి-పఠాన్ బాబు ల ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో కలిసి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జి.సుభద్రమ్మ, డిటి- పఠాన్ బాబు లు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఓటు ఎంతో అమూల్యమైనదని అన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాకుండా, గణతంత్రాన్ని బలోపేతం చేసే ఒక పవిత్రమైన పౌర బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, విఆర్వోలు శివన్న, మహబూబ్ సాహెబ్, కలిముల్లా, రాముడు, మక్బూల్ భాష, తదితర విఆర్వోలు, వీఆర్ఏలు, ఆయా గ్రామాల ఓటరు మహాశయులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News