ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ప్రభుత్వ టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో డైనమిక్ లీడర్ & నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలను నాయకులు, కార్యకర్తల మధ్యన ఘనంగా నిర్వహించడం జరిగింది. పాములపాడులో బైరెడ్డి అభిమానులు, కూటమి నాయకుల, కార్యకర్తల సమక్షంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి, ఒకరు తినిపించుకొని సంతోషంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలలో చిన్నారులు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. అనంతరం ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ కురువ. రమేష్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి కరివేన ఎస్.ఆర్.బీ.సీ. కాలనీలోని, మానవతా నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అనాధలకు ఈ చలికాలంలో కప్పుకోవడానికి బెడ్ షీట్లు, మరియు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు కే.రమేష్ మాట్లాడుతూ మన రాయలసీమ పులి & నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసురాలు, తండ్రిలోని మంచితనాన్ని పునికిపుచ్చుకొని కష్టాల్లో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ అన్ని రకాలుగా సహాయం అందిస్తున్న నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ, గొప్ప గొప్ప పదవులు చేపట్టి, ప్రజలకు మంచి సేవ చేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాండ్ల సురేష్, కురువ వెంకటేశ్వర్లు, సునీల్, ఈశ్వర్, రంజిత్, కురువ.నాగరాజు, చింటూ, శివ, టైలర్ వెంకటస్వామి, మధు, అలిభాష, లింగాల మల్లికార్జున, సుభాన్, శ్రీనివాసులు, చిన్న, భరత్, నాగరాజు, శాంతరాజు, మానవతా నిలయం వృద్ధాశ్రమం నిర్వాహకులు యుగంధర్, వృద్ధులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News