ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో నియోజకవర్గానికి సంబంధించి పి4 ఎమ్మెల్యే కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు అధికారులు, నాయకులతో కలసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి” గొప్ప సంకల్పంతో, పేదరికంలేని స్వర్ణాంధ్ర కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకొని, మీరు కూడా ఈ రోజే పి4 లో భాగస్వాములై, అందరికీ మార్గదర్శిగా ముందుకొచ్చి సమాజంలోని బంగారు కుటుంబాలకు మీ వంతు సహాయం చేయండని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు, అవసరమైన మౌలిక సౌకర్యాలు, మరియు ఆర్థిక మద్దతు అందిస్తూ, వారి జీవితాలలో మార్పు తీసుకురావడానికి పి4 కృషి చేస్తోందని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, పాములపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు షేక్.కరీం బాష, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, బిజెపి నాయకుడు చల్లా దామోదర్ రెడ్డి, జనసేన నాయకుడు నల్లమల.రవికుమార్, మున్సిపల్ కమిషనర్- ఎస్.బేబీ, పాములపాడు ఎంపీడీవో ఎన్. చంద్రశేఖర్, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లాయర్ సురేష్, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News