ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు సింగపూర్ దేశానికి వచ్చిన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల.రమేష్ బాబుకు శాలువా కప్పి, ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు భారతీయులందరికీ, మరియు సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజానికి పేరుపేరునా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పెందుర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పంచకర్ల.రమేష్ బాబు ని ఆత్మీయంగా కలిసి సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని అన్నారు. ఆయనకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు నిత్య సమాజసేవకుడిగా దేశ, విదేశాలలో అనేక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేష్ మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించి, అందరి మండల పొందాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సామాజికవేత్తలు ఆ దేవున్నీ ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేష్ మాట్లాడుతూ స్నేహం అనేది రక్త సంబంధం కాదనీ, మనసులను కలిపే అద్భుతమైన ఆత్మీయ బంధం గొప్పదని అన్నారు. కష్టాల్లో అండగా నిలిచి, సంతోషాల్లో తోడుగా ఉంటూ, జీవిత ప్రయాణాన్ని మరింత అందంగా మార్చే ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నా జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి మిత్రునికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలతో చిరస్థాయిగా ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Admin
E Nivas News