ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ వి.రామస్వామి ఆధ్వర్యంలో తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్. చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజీ నాయక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ ల సమక్షంలో బుధవారం గ్రామసభ నిర్వహించడం జరిగింది. జాతీయ రహదారి 340 సి నిర్మాణంలో పాత ఎంపీపీ స్కూల్ భవనం కోల్పోవడంతో నూతన భవనానికి గ్రామంలోని, బలిజ వేణుకు సంబంధించిన స్థలములో పాఠశాల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని గ్రామస్తులు, వార్డు మెంబర్లు మండల స్థాయి అధికారుల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News