ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, హోటళ్ళ ను, రెస్టారెంట్లను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో గల హోటల్ మరియు రెస్టారెంట్ యజమానులకు వారి హోటల్స్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొనవలెను. మరియు హోటల్స్ యందలి కిచెన్ గోడలు పరిశుభ్రంగా ఉంచుకొనవలెనని, వంట చేసే, వడ్డించే కార్మికుల చేతికి కాళ్లకు చర్మవ్యాధులు లేకుండా చూసుకునవలెనని మరియు వారికి గ్లౌజులు మాస్కులు ఉండే విధంగా చూసుకునవలెనని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులకు మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సురక్షిత మంచినీటిని సరఫరా చేయవలెనని తెలియజేశారు. వారి హోటల్స్ లకు సంబంధించిన మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ లను సకాలంలో చెల్లించవలసిందిగా వారిని కోరడమైనది. ఏ విధమైన పొరపాటు జరిగిను మున్సిపల్ చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకొనబడునని వారిని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ ఔకు.ఓబులేసు, అసిస్టెంట్ ఇంజనీర్ షాహిర్ భాష, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు షేక్.ఖాజా, ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.
Admin
E Nivas News