Tuesday, 28 July 2026 10:55:31 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

పాములపాడులో హిందూ సమ్మేళనం విజయవంతం

కులం మన ఇంటి వరకే పరిమితం...! గడప దాటితే మనమంతా హిందువులం

Date : 25 December 2025 11:53 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం  అయింది. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిదులు గౌరవనీయులు విరజానంద స్వామీజీ పాల్గొన్నారు. పాములపాడు మండల హిందువులంతా జనార్దన్ రైస్ మిల్ వద్దా స్వామీజీని ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి పూలు చల్లుకుంటూ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ చౌడేశ్వరి దేవాలయం వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం స్వామీజీ దేవాలయంలోకి వెళ్లి శ్రీ చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకొని భరతమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రద్యులైన చేశారు. అనంతరం స్టేజిపై వివిధ రకాల నృత్య కళలను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం శ్రీశ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ స్వశక్త హిందూ స్వాభిమాన్ నిర్మాణం కోసం మరియు ప్రతి హిందువులో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం ఆర్ఎస్ఎస్ అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాలను నిర్మాణము చేస్తూ నేడు 100వ సంవత్సరములోకి అడుగు పెడుతున్న సందర్భముగా కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించిందని అన్నారు. ప్రతి హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం మన గ్రామాలలో మరియు బస్తీలలో హిందుత్వ వాతావరణం నిర్మాణం చేయడం, మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం, మనమంతా హిందువులం, కులం మన ఇంటి వరకే పరిమితం అని. గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన నిర్మాణం చేయయడం, మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సమరసతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత అని, ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సమ్మేళన నిర్వాహకులు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు-రాయపాటి.మురళీమోహన్, విజయసింహా రెడ్డి, టి ఎన్ ఆర్ నాగరాజు, రాజేష్, రాయపాటి గోవిందు, నర్సపేట రామకృష్ణ, అపర్ణ దీపిక, జూటూరు రమేష్ ఆచారి, సత్యమయ్య, సాయి కృష్ణ, కురువ పుల్లయ్య, నాని రామస్వామి, వివిధ గ్రామాల హిందువులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :