Friday, 11 September 2026 09:05:54 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

సమర్ధవంతమైన విపత్తు చర్యలు ప్రమాద తగ్గింపుకు దోహదం చేస్తాయి..! ప్రకృతి విపత్తుల్లో వ్యక్తులతోపాటు, కమ్యూనిటీలు ప్రధానపాత్ర పోషించాలి

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్

Date : 30 January 2026 06:54 PM Views : 184

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది చివరికల్లా ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని, డీవీ మేనర్ హోటల్ లో రాష్ట్ర విపత్తు రిస్క్ తగ్గింపు కోసం రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాపులో భాగంగా రెండో రోజు శుక్రవారం డిజాస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తరచుగా సంభవించే తుఫానులు, వరదల సమయంలో సమాచారాన్ని త్వరితగతిన చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ ను సిద్ధం చేసేలా పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మహిళా శిశు సంక్షేమం, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు చెందిన అధికారులు చర్చించడం శుభ పరిణామమన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) లైఫ్ సైకిల్‌లో ఉండే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ షాప్ లో వివరణాత్మకమైన ప్రెజెంటేషన్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. వర్క్ షాప్ లో వివిధ శాఖల అధికారుల సూచనలన్నింటినీ క్రోడీకరించి ఒక 'కోర్ గ్రూప్'ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల్లో ఉన్న లోపాలను సవరించి వర్క్ షాపులో సూచనలను ఈ ఏడాది నుంచే పరిగణనలోకి తీసుకుని 'ప్రీ-యాక్టివిటీ ప్లాన్', 'డిజాస్టర్ ప్లాన్'లో పొందుపరుస్తామన్నారు. వర్క్ షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్న వారందరూ ఎస్డీఎమ్ఏ, యూనిసెఫ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆయా సంస్థలకు రాయబారులుగా (అంబాసిడర్స్) వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ఇది ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమేనని, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు జిల్లా స్థాయి, మండల స్థాయి, నుంచి స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ స్థాయి వరకు వెళ్లాలన్నారు.

జిల్లా స్థాయిలో శిక్షణకు ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా, అర్థమయ్యేలా చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డీఎమ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్. వెంకట దీపక్, ఎన్ఐడీఎం జేడీ కల్నల్ పీఎస్ రెడ్డి, యూనిసెఫ్ స్పెషలిస్ట్ సీమా, బీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్స్ ప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :