Tuesday, 28 July 2026 07:00:43 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

సమర్ధవంతమైన విపత్తు చర్యలు ప్రమాద తగ్గింపుకు దోహదం చేస్తాయి..! ప్రకృతి విపత్తుల్లో వ్యక్తులతోపాటు, కమ్యూనిటీలు ప్రధానపాత్ర పోషించాలి

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్

Date : 30 January 2026 06:54 PM Views : 156

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది చివరికల్లా ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని, డీవీ మేనర్ హోటల్ లో రాష్ట్ర విపత్తు రిస్క్ తగ్గింపు కోసం రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాపులో భాగంగా రెండో రోజు శుక్రవారం డిజాస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తరచుగా సంభవించే తుఫానులు, వరదల సమయంలో సమాచారాన్ని త్వరితగతిన చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ ను సిద్ధం చేసేలా పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మహిళా శిశు సంక్షేమం, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు చెందిన అధికారులు చర్చించడం శుభ పరిణామమన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) లైఫ్ సైకిల్‌లో ఉండే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ షాప్ లో వివరణాత్మకమైన ప్రెజెంటేషన్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. వర్క్ షాప్ లో వివిధ శాఖల అధికారుల సూచనలన్నింటినీ క్రోడీకరించి ఒక 'కోర్ గ్రూప్'ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల్లో ఉన్న లోపాలను సవరించి వర్క్ షాపులో సూచనలను ఈ ఏడాది నుంచే పరిగణనలోకి తీసుకుని 'ప్రీ-యాక్టివిటీ ప్లాన్', 'డిజాస్టర్ ప్లాన్'లో పొందుపరుస్తామన్నారు. వర్క్ షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్న వారందరూ ఎస్డీఎమ్ఏ, యూనిసెఫ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆయా సంస్థలకు రాయబారులుగా (అంబాసిడర్స్) వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ఇది ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమేనని, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు జిల్లా స్థాయి, మండల స్థాయి, నుంచి స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ స్థాయి వరకు వెళ్లాలన్నారు.

జిల్లా స్థాయిలో శిక్షణకు ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా, అర్థమయ్యేలా చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డీఎమ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్. వెంకట దీపక్, ఎన్ఐడీఎం జేడీ కల్నల్ పీఎస్ రెడ్డి, యూనిసెఫ్ స్పెషలిస్ట్ సీమా, బీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్స్ ప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :