ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నేటి ఉదయం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి, వారి యోగ - క్షేమాలు అడిగి తెలుసుకుని, అవ్వాతాతలకు పింఛన్లు నాగలూటీ గ్రామ కూటమి నాయకులతో కలిసి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అందజేయడం జరిగింది. పింఛన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యే గిత్త. జయసూర్య అడిగి తెలుసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 18 నెలల పాలనలో ఎన్టీఆర్ భరోసా ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే “మంచి ప్రభుత్వం” అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు మండల ఎంపీడీవో దశరధరామయ్య, పోలీసు సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వం అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News