ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో,గురుకుల పాఠశాలల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 2011వ సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారమే నియమించబడాలి. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యా అర్హతలు లేనివారు చాలా మంది అడ్డదారిలో ముడుపులు చెల్లించి డూప్లికేట్ ఉద్యోగులుగా నేడు పని చేస్తున్నారని, గురుకులాల్లో ఐటీడీఏ అధికారులు అక్రమ మార్గంలో ఉపాధ్యాయులుగా కొంతమందిని నియమించారని, వారు పాఠశాలకు ఎగనామం పెట్టి టెట్ కోచింగ్ లో ఉన్నారని, వారిని వెంటనే గుర్తించి,తొలగించి వారి స్థానంలో అన్ని ఆర్హతలు కలిగిన వారిని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులుగా నియమించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రమోషన్లు ఉండవన్నారు. కానీ కొంతమంది అధికారులు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చి ఎక్కువ జీతం ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులకు మనవి చేసుకుంటున్నాను.
Admin
E Nivas News