ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులచే స్వాతంత్ర దినోత్సవ కర్తవ్యాలను పాటించాలని తహసిల్దార్ జి.సుభద్రమ్మ ఆధ్వర్యంలో ఎంఈఓ-1 బాలాజీ నాయక్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాలు, ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర, ఎంఈఓ-2 గోపాల్, డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ కే.సాయికృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ మాట్లాడుతూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యార్థులకు అప్పటి మహానుభావులు కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా కలిసి వెలిసి, బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు. వారి ఆశయాల సాధన కోసం మనమందరము దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల పట్ల అవగాహన కల్పించాలని మండలంలోని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News