ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ గడివేముల : గడివేముల బాలుర వసతి గృహంలో కూరగాయలు, నిత్యవసర వస్తువులు సరిగ్గా లేవని వెంటనే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గడివేముల మండల కేంద్రంలోని, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడుతూ హాస్టల్ నందు 150 మంది బాలురు ఉంటే, ప్రస్తుతం 120 మంది హాజరుగా ఉన్నారని తెలిపారు. హాస్టల్లో కూరగాయలు తాజా కూరగాయలు తేకుండా, ఐదు రోజులకోసారి కూరగాయలు తెస్తున్నందున, ఆ కూరగాయలు కొన్ని మురిగిపోయి సరిగ్గా లేవని వాటిని పిల్లలకు వండి పెడుతున్నారని ఇది ఎంత అన్యాయమని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్ నందు మురళి రెడ్డి అనే ఉద్యోగి హాస్టల్ కు రాకుండా ఒక మహిళను కూలీగా పెట్టి సంవత్సరం నుండి హాస్టల్ కు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు తాజా కూరగాయలతో మంచి భోజనం పెట్టడం లేదని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రగ్గులు కూడా ఒక్కొక్క విద్యార్థికి ఒకటే ఇచ్చారని ఈ మధ్యకాలంలో చలి ఎక్కువైందని పిల్లలకు ఇంకొక బెడ్ షీట్ ఇవ్వాలని ఆయన అన్నారు. పై విషయాలపై జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News