ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య అన్నారు. గురువారం పట్టణంలోని, మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్, డిసిసిబి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని డిసిఎంఎస్ (డిసిఎంఎస్) చైర్మన్ నాగేశ్వర్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. *ముఖ్య అంశాలు*:- *మద్దతు ధర*- ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కందుల కొనుగోలు జరుగుతుంది. *దళారుల వద్దు*- రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. *పారదర్శకత*- కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్-కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వివిధ సొసైటీ చైర్మన్లు మార్క్ఫెడ్ అధికారులు, ఎంఎల్ఎ గవర్నమెంట్ పిఎ- రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, మరియు నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Admin
E Nivas News