ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "జనతా వారధి" కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్ పిలుపు మేరకు, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సూచన మేరకు, బిజెపి సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ ఆద్వర్యంలో జనతా వారధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనతా వారథి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు లో గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని పడగొట్టి, వెంటనే నూతన భవనం ఏర్పాటు చేయాలని, గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు, వితంతువులు, చిన్నపిల్లలకు ప్రాథమిక చికిత్స లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ప్రజల నుండీ వచ్చిన వినతి పత్రాలను తహసిల్దార్- జి.సుభద్రమ్మ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రవరం గ్రామ బిజెపి నాయకులు చంద్రారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News