Tuesday, 28 July 2026 06:17:02 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 23 February 2026 11:46 PM Views : 146

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : - ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమ‌వారం ప్రారంభం కాగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ న‌గ‌రంలోని వివిధ ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. శార‌దా క‌ళాశాల‌, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లోని ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నియమావళి ప్రకారం జరుగుతున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వ‌ద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స‌రైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫ‌స్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. మాల్ ప్రాక్టీసులను పూర్తిగా నివారించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప‌రీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్షా నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాల‌న్నారు. పరీక్షలను సజావుగా, నిరాటంకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 36,928 మంది మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థుల‌కు 98 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఉద‌యం 9 గం. నుంచి మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. త‌నిఖీల్లో జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: