Wednesday, 29 July 2026 01:35:47 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మాక్ అసెంబ్లీకి వెళ్లిన వెంకటాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థి రాజశేఖర్ కు ఘనంగా సన్మానం

Date : 28 November 2025 09:04 PM Views : 251

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండల పరిధిలోని, వెంకటాపురం జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్, మాక్ అసెంబ్లీ ఎన్నికై, డిప్యూటీ స్పీకర్ గా రాణించారు. ఈ కార్యక్రమం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జవహర్ నాయక్ ఆధ్వర్యంలో ఆత్మకూరు టౌన్ సిఐ- డి.రాము విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్ కు ప్రజాసంఘాల నాయకులతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాపికను చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు అర్బన్ సిఐ-డి. రాము మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువు పేదరికం నిర్మూలన చేస్తుందని అన్నారు. చదువు సమాజంలో మంచి గౌరవాన్ని హోదాను ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ బాలాజీ నాయక్, మురళి నాయక్, హనుమంతు నాయక్, కృష్ణయ్య, ఈశ్వర్ నాయక్, వి.పుల్లయ్య, బి.వి.రమణ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :