ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండల పరిధిలోని, వెంకటాపురం జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్, మాక్ అసెంబ్లీ ఎన్నికై, డిప్యూటీ స్పీకర్ గా రాణించారు. ఈ కార్యక్రమం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జవహర్ నాయక్ ఆధ్వర్యంలో ఆత్మకూరు టౌన్ సిఐ- డి.రాము విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్ కు ప్రజాసంఘాల నాయకులతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాపికను చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు అర్బన్ సిఐ-డి. రాము మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువు పేదరికం నిర్మూలన చేస్తుందని అన్నారు. చదువు సమాజంలో మంచి గౌరవాన్ని హోదాను ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ బాలాజీ నాయక్, మురళి నాయక్, హనుమంతు నాయక్, కృష్ణయ్య, ఈశ్వర్ నాయక్, వి.పుల్లయ్య, బి.వి.రమణ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News