Friday, 11 September 2026 08:13:15 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

దేశ భాషలందు తెలుగు లెస్స... కురుకుంద జడ్పీ హైస్కూల్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

Date : 29 August 2026 07:59 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : దేశభాషలందు తెలుగు లెస్స అని కురుకుంద ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు జగదీశ్వరి అన్నారు. శనివారం నాడు ఆత్మకూరు మండలంలోని, కురుకుంద ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి హెచ్ఎం జగదీశ్వరి మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు చరిత్రకారుడు సంఘసంస్కర్త హేతువాది ఉపాధ్యాయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163 వ జన్మదినోత్సవాన్ని మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారములోని భాషలో ఉన్న అందాన్ని విలువను తెలియజేప్పిన మహనీయుడని, ఆంధ్రదేశంలో వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు బహు భాషా కోవిదుడు సంఘసంస్కర్త హేతువాది శిష్ట జన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని అన్నారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోనికి వచ్చిందని ఆమె అన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైందని, గిడుగు రామమూర్తి పంతులు జన్మ దినోత్సవం ఆగస్టు-29 తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామనీ అన్నారు. తెలుగు భాష తేనే కన్నా తీయనిది, వెన్నకన్నా కమ్మనిది, చందమామ కన్నా చల్లనిది అని, తెలుగు నేర్చుకుందాం మన భవిత మార్చుకుందాం, మాతృభాష నేర్చుకో అనుబంధం పెంచుకో, తెలుగు జాతి మనది తెలుగు భాష మనది, తెలుగు నేలపైన తెలుగు వికసించాలి,మాతృభాష తెలుగు మన బ్రతుకంతా వెలుగు,నేర్చుకుందాం నేర్చుకుందాం తెలుగు భాషను నేర్చుకుందాం అని ఆమె అన్నారు. పి.డి-మురళి నాయక్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం వ్యాసరచన, పద్య పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జవహర్ నాయక్, మురళీ నాయక్, రవి, రవి ప్రకాష్, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :