Monday, 14 September 2026 08:06:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

కల్లూరి పెద్ద మస్తానయ్య సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్

Date : 18 February 2026 11:06 PM Views : 213

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నంద్యాల జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టిబి కంట్రోల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు టీబి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ తెలిపిన విధంగా ఆత్మకూరు పట్టణంలో గల గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ హెడ్మాస్టర్ పి.దేవానంద్ మరియు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి మైక్రో బ్యాక్టీరియంటుబర్క్లోసిస్ ద్వారా ఒకరి నుండి మరొకరికి ఎడతెరిపిలేని దగ్గు, దగ్గు తో పాటు గళ్ళ పడడం, దగ్గు తో పాటు రక్తం పడడం, సాయంత్రం జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, లాంటి లక్షణాలు కలవారు దగ్గరలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గళ్ళ పరీక్ష మరియు మెడికల్ ఆఫీసర్ గారితో పరీక్ష చేయించుకుని క్షయ అని నిర్ధారణ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ తెలిపిన విధంగా డాట్ సిస్టం ద్వారా నిర్ధారించిన మాత్రలను సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోవడం వల్ల క్షయ పూర్తిగా నయం అవుతుంది. 56 రోజులకు ఒకసారి ఐపి గల్ల పరీక్ష తర్వాత 112లకు కంటిన్యూషన్ ఫేస్ గల్ల పరీక్ష చేయించుకుని పూర్తిగా నయమైనది తెలుసుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆరు నెలలకు ఒకసారి ఫాలో అప్ చేయించుకోవడం వల్ల క్షయ వ్యాధి పూర్తిగా నయం అవడమే కాకుండా మరలా రాదు అని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నారు. ఈ విధంగా కాకుండా ఒక క్షయ వ్యాధిగ్రస్తుని కి మందులు వాడించకపోతే ఒక సంవత్సరంలో 15 మందికి అదేవిధంగా రెండో సంవత్సరంలో 225 మందికి మూడో సంవత్సరంలో 4000 పైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఏర్పడవచ్చు అందువలన నివారించడం చాలా కష్టమవును అందువలన ప్రతి లక్షణాలను త్వరగా గుర్తించడం, క్షయ వ్యాధి లక్షణాలు గల వారిని త్వరగా గళ్ళ పరీక్ష, చేయించడం జరుగుతుందన్నారు. గళ్ళ పరీక్షలో క్షయ నిర్ధారణ అయిన వారికి త్వరగా డాట్ సిస్టం ద్వారా మందులు మింగించడం వలన క్షయ వ్యాధిని నివారించడంలో ప్రతి ఒక్కరం తోడ్పడుతామని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద వస్తానయ్య తెలియజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్ పి.దేవానంద్ ప్రతి ఒక విద్యార్థిని, విద్యార్థులు క్షయ వ్యాధి నివారణలో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థి పాత్రను పోషించి క్షయవాది నివారణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :