ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : మనువాద పాసిస్ట్ పాలకులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మావోయిస్టుల పైన ఆదివాసీల పైన దాడులు చేస్తూ ఎన్కౌంటర్ పేర్లతో హత్య చేస్తా ఉంది ఈ బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని నందికొట్కూరు పట్టణంలోని, అంబేద్కర్ సర్కిల్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి కే.అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై.నరసింహులు మాట్లాడుతూ భారతదేశంలో అనేక పోరాటలు జరిగాయి. కానీ ఆదివాసీల పోరాటం ఎంతో ప్రాముఖ్యమైనది ఆదివాసి పోరాటంలో కాను, గుండా దూర్, బిర్సా ముండా రామ్ జి.గుండు, కొమరం భీమ్, తదితర అనేక ప్రముఖులు ఆదివాసి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి వలసకాలం నుండి భారతదేశంలో ఉన్న అటవీ ఖనిజా సంపదను కాపాడుతూ, ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆకృత్యాలను ఎదుర్కొన్న ప్రయత్నంలో అమరులైనారన్నారు. నేడు భారతదేశంలో మనువాద పాలకులు మావోయిస్టులను అభివృద్ధి పేరుతో ఆదివాసీలను సంక్షేమం పేరుతో సంపదను రక్తంతో తూచి వారిపై దాడులు హత్యలు చేస్తూ కార్పొరేట్ కంపెనీల అత్యాశకు ఆదివాసీలను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ నాయకులను బూటక ఎన్కౌంటర్ చేస్తా ఉందని వెంటనే నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ దేశ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులైన అంబానీ ఆదాని కంపెనీలకు అప్పజెప్పడం కోసం నరేంద్ర మోడీ పాసిస్ట్ పాలన కొనసాగిస్తూ మావోయిస్టు నాయకులైన హీఢ్మ్. రాజి, టెక్ శంకర్ తదితరులను ఎక్కడినుంచి తీసుకొచ్చి ఎన్కౌంటర్ల పేర్లతో రాజ్యం హత్య చేసింది వీటిని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టుల పైన జరుగుతున్న దాడులను బూటక ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్కౌంటర్లు వ్యతిరేకిస్తున్న గాని లెక్కచేయక ఆదివాసులపై దాడులు చేస్తూ వారికి రక్షణగా ఉన్న మావోయిస్టులను అత్యంత పాశవికంగా హత్య చేస్తా ఉందన్నారు. ఈ హత్యలను సుప్రీంకోర్టు ద్వారా విచారించి బాధ్యులను కఠినంగా శిక్షించి ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పూనుకోవాలని, ఆదివాసీల సమస్యలను పరిగణలోకి తీసుకొని నెరవేరాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పకీర్ సాహెబ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, మహిళా సంఘం నాయకురాలు హుసేనమ్మ అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రమణయ్య, ఎల్లనాయుడు, పుల్లన్న, పిడిఎస్యు జిల్లా నాయకులు కే.ఆది, సిఐటియు నాయకులు ఉస్మాన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News