Tuesday, 28 July 2026 07:53:07 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు. చరిత రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన పాములపాడు మండల నాయకుడు జి.హరిప్రసాద్ యాదవ్

Date : 24 December 2025 03:09 PM Views : 482

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల నాయకుడు జి.హరి ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నూతన అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు.చరిత రెడ్డికి పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాములపాడు మండల నాయకుడు & మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్- జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు.వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి లు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తమ నియోజకవర్గాలలోనే కాకుండా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలను స్నేహపూర్వకంగా కలుపుకొని ముందడుగు వేసే మంచి గుణము ఆ కుటుంబానిదని అన్నారు. ఏ నాయకుడు గానీ, ఏ కార్యకర్తగాని కష్టాల్లో ఉంటే మేమున్నామని మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చే కుటుంబం వారిదని అన్నారు. వారు చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల నాయకులు హరినాధ రెడ్డి, శివ శంకర్ స్వామి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :