ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, సుగాలి గిరిజనుల జాతిపిత,ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్,గిరిజన నాయకులు ఈశ్వర్ నాయక్ అన్నారు. ఆదివారం నాడు ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్, గిరిజన నాయకుడు ఈశ్వర్ నాయక్ లు మాట్లాడుతూ ధర్మియాడి, భీమానాయక్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన సేవాలాల్ మహారాజ్ పుట్టుకతోనే సంపూర్ణ జ్ఞానం కలిగినవాడని,చిన్నప్పటి నుంచే సేవాగుణం కలిగిన వారని, సుగాలి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని, బ్రిటిష్ వారి పాలనలో మతమార్పిడిలను అడ్డుకున్నారని, దేశవ్యాప్తంగా సుగాలి గిరిజనులను చైతన్యపరుస్తూ తండాల అభివృద్ధికి కృషి చేశారని, సుగాలి గిరిజన సమాజంలో ఉన్న అపోహాలు మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని, సుగాలి గిరిజనుల సంస్కృతిని కాపాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించారని,సుగాలి గిరిజనుల ఆరాధ్య దైవం జాతిపిత,సేవాలాల్ మహారాజ్ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని,శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి-15 వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని సుగాలి గిరిజన జాతి ప్రజలు ఒక పండుగలాగా జరుపుకుంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా నాయక్, నాగరాజు నాయక్, పెద్ద లక్ష్మనాయక్, హరీష్ నాయక్, శివమణి నాయక్, జయమ్మ బాయి, నాగమ్మ బాయి, సుభద్ర బాయి, కేషమ్మ బాయి, యశోద బాయి, రాజేశ్వరిబాయి, కళావతి బాయి, రాధా బాయి, తదితరులు పాల్గోన్నారు.
Admin
E Nivas News