ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నందికొట్కూరు నియోజకవర్గం, మిడుతూరు మండలంలోని, చౌట్కూరు, గుడిపాడు గ్రామలలో ఉన్న 33, 34 బూత్ లను నందికొట్కూరు నియోజకవర్గం బూత్ అబ్జర్వర్ జి.నాగముని ముఖ్య అతిథిగా పాల్గొని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ అబ్జర్వర్ జి.నాగముని మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించడం జరిగినది.డోర్ టు డోర్ తిరిగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి ఓటు వేసి, గెలిపించాలని కోరడం జరిగింది. ఆ గ్రామాలలో ఉన్న సమస్యలను గురించి ఆయన పార్టీ దృష్టికి తీసుకొని పోతానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టీ.డీ.పీ నియోజకవర్గ నాయకులు ఇంతియాజ్ భాష,చౌట్కూరు గోకారి, గుడిపాడు గ్రామాలలోని, టిడిపి నాయకులు బూత్ గురించి ఆయనకు తెలియజేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన దిశా, నిర్దేశనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News