ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మెమో-57 ప్రకారం, వివిధ కారణాల వలన సాంకేతికంగా సిపిఎస్ అమలు తర్వాత ఉద్యోగ నియామకం పొందిన వారికి, వారికి అర్హత వున్న, పాత పెన్షన్ వర్తింపు చేస్తూ నేడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి లు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల, ఆయనకు డీఎస్సీ-2003, మరియు ఇతర ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన డీఎస్సీ-2003 ద్వారా నియమితమైన దాదాపు 7000 మంది ఉపాధ్యాయులు సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి రావడం వలన, సామాజిక, ఆర్థిక భరోసా కలుగనుందని పేర్కొన్నారు. ఇది పిఆర్టియు ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె.శ్రీనివాసులు నాయుడు, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం నిరంతర కృషి సల్పడం వలన సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇదే సానుకూల ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని, ఇతర బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.
Admin
E Nivas News