ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, బైర్లూటి బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ మాట్లాడుతూ గత రెండు వారాల నుంచి బాలికలకు పాలు ఇవ్వటం లేదనీ, గత రెండు వారాల నుంచి బాలికలకు చికెన్ పెట్టడం లేదనీ, పాఠశాల ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండటం లేదనీ, బాలికలకు స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించటం లేదనీ అన్నారు. పాఠశాలలో పనిచేసే పురుష ఉపాధ్యాయులను వెంటనే బదిలీ చేయాలన్నారు. కావునా సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాననీ అన్నారు.
Admin
E Nivas News