ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి 'షైనింగ్ స్టార్' ప్రతిభ అవార్డును పాములపాడులోని, శ్రీ వివేకానంద విద్యావిహార్ హైస్కూల్ విద్యార్థి సయ్యద్. మహమ్మద్ అయాజ్ అలీ అందుకున్నారు. నంద్యాలలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్, డిఇఓ జనార్దన్ రెడ్డి, తదితర ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థి ఎస్.అయాజ్ అలీ కి ఈ అవార్డును అందజేసి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి తమ మండలానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన అయాజ్ అలీని పలువురు ప్రముఖులు శ్రీ వివేకానంద విద్యా విహార్ పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ రాయపాటి.దేవిక లు విద్యార్థి కృషిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థి తల్లి తండ్రులు కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం వల్లే మా కుమారుడికి షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డు రావడం అభినందనీయం అన్నారు. తన కుమారుడు ఆయాజ్ అలీ ని ఐఐటీఎన్ గా చేయడమే తన లక్ష్యం మన్నారు. కుటుంబ సభ్యులు సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షులు ఎస్.షర్ఫద్దీన్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్.షేక్షాఅలీ, చిన్నప్పుడు నుంచి కష్టపడి చదివే తత్వం ఎస్.ఆయాజ్ అలి ది అని కొనియాడారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి విద్యా బోధన చేసిన శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్, హెచ్ఎం రాయపాటి దేవిక లకు ఉపాధ్యాయులకు మరియు సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి నుంచే చదువులో, ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న అయాజ్ అలీకి రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా, డివిజన్, నియోజవర్గ, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
Admin
E Nivas News