ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డివిజన్ స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ఈరోజు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ టిడిపి అధ్యక్షులు వేణుగోపాలరావు తో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, తమలోని నైపుణ్యతను వెలికితీస్తాయని అన్నారు. చదువుతోపాటు, క్రీడలలో కూడా తమ ప్రతిభ పాటలను చాటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ శివకుమార్, ఆత్మకూరు డివిజన్ లోని అన్ని మండలాల ఎంఈఓ లు, హెచ్ఎంలు, పిఈటిలు, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు మున్నా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News