ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని,వేంపెంట గ్రామంలో గోకులం షెడ్ నిర్మాణానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ భూమి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి, ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ షెడ్ పశువులకు ఎండ, వర్షం నుండి రక్షణగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పశువులు ఉండే ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వేంపెంట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రవి శంకర్, పంచాయతీ సెక్రటరీ పుల్లయ్య, టెక్నికల్ అసిస్టెంట్ కిరణ్, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, కుటుంబరావు, రత్నాకర్, బోనాల భాస్కర్, జీవన్న, సుబ్బారావు, ఆంథోనీ, చిట్టిబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News