ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ** దేశ పోరాటం న్యూస్ నందికొట్కూరు:-నందికొట్కూరు మండలంలోని, వడ్డమాను, బొల్లవరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 5 మందికి 554,863/-లక్షల రూపాయలు మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొల్లవరం గొల్ల లక్ష్మీదేవి కి రూ.20,000/-, జంగం పాడు శివ నాయక్ కి రూ.37,179/-, కోళ్ల బావాపురం డేగ దినేష్ కి రూ.91,819/-, దామగట్ల బైరెడ్డి లలితమ్మ కి రూ.213,916/-, వడ్డేమాన్ బోయ రంగస్వామి కి రూ.191,949/- మంజూరైన, విలువైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, సత్యం రెడ్డి, తిప్పారెడ్డి, సుందర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి మరియు నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News