ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఈనెల 28న ఉదయం 10 గం.లకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్.కె.కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించు 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేయడమైనది. ఇందులో భాగంగా పాములపాడు మండల కేంద్రానికి విచ్చేసి స్థానిక రజక నాయకులు, కార్యకర్తలను కలిసి సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సభకు అధిక సంఖ్యలో రజకులను తరలించాలని కోరారు. స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్. గోపాల్, రాయలసీమ సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు, చెలిమిళ్ళ గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తదితరులను కలవడం జరిగింది. ఈ రజక ఆకాంక్ష సభకు రాష్ట్ర రజక ఫెడరేషన్ డెవలప్మెంట్ చైర్మన్-రాయపాటి.సావిత్రి అధ్యక్షతన సమావేశము నిర్వహించబడును. ఈ సభకు జిల్లాలోని పార్లమెంట్ సభ్యురాలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు, వివిధ జిల్లాల రజక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబేటి సుకుమంబ కుమారి, కొర్రపోలూరు నాగరాజు, బస్తిపార్టీ మౌలాలి, మోతుకూరు నాగన్న, రేగడగూడూరు వెంకటస్వామి, రైల్వే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
Admin
E Nivas News