ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో భక్తి శ్రద్దలతో శ్రీ కృష్ణుని పల్లకి ఉత్సవ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యాదవ సంఘము పెద్దలు మాట్లాడుతూ శ్రీ రాధా రుక్మిణి కృష్ణ ఉత్సవ విగ్రహాలు పల్లకి ఊరేగింపు గ్రామంలో అంగరంగ వైభవంగా, భజంత్రి ల నడుమ, చెక్క భజనలు, కోలాటల మధ్య గ్రామం లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేశారని చెప్పారు. ఊరేగింపు తదనంతరం, అన్నదాన కార్యక్రమం సుమారుగా ఒక వెయ్యి మంది కి పైగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విజయం అవ్వడానికి ప్రతి ఒక్కరి కృషి మరువలేనిది అని యాదవ సంఘ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి & మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్, చింతల నారాయణ (మాజీ సర్పంచ్),చింతల కుమార్, మందడి మల్లికార్జున, దుర్వేసి వెంకటేశ్వర్లు & బ్రదర్స్, మిడ్తూరు బ్రదర్స్, ఉప్పలపాటి గోపి, తారకేశ్వర్, బొల్లారం బ్రదర్స్, గుండ్ల బంగారు, సురేష్ , నన్నూర్ బ్రదర్స్, దాంగట్ల బాబు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
E Nivas News