ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఏపీ జెఎసి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనలో భాగంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం ఆత్మకూరు తాలూకా జేఏసీ చైర్మన్ ఎస్.సాజిద్ భాష, సెక్రటరీ జనరల్ ఎం.షేక్ ఉమ్మర్, ట్రెజరర్ ఎం.చంద్రశేఖర్ లు నాయకత్వంలో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని సభ్య సంఘాల నాయకులతో కలిసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయవలసినదిగా కోరడమైనది. ఈ సందర్భంగా వారు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ, సరెండర్ లీవుల చెల్లింపు, పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాల మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు, పూర్తి స్థాయిలో సిపిఎస్ రద్దు చేయాలని, తదితర 10 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, తాలూకా జేఏసీ కో చైర్మన్లు సయ్యద్ ఇబ్రహీం, బాలాజీ రావు, పి.శివప్రసాద్, తులసీస్వర్ రెడ్డి, రాజశేఖర్, రఘురాముడు, అజమ్, పెన్షనర్లు కొండయ్య, సుంకన్న, నాగప్ప, నాయకులు పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News