ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలో ఇనాం భూముల నుంచి అర్హత గల భూములను లేదా "సర్వీస్ ఇనాం" భూములను నిషేధిత జాబితా (22-ఎ) నుంచి తొలగించాలని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తహసిల్దార్ సుభద్రమ్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు, జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు సూచనలతో పాములపాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో "జనతా వారధి" కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇనాం భూముల నుంచి అర్హత గల భూములను లేదా "సర్వీస్ ఇనాం" భూములను నిషేధిత జాబితా (22-ఎ) నుంచి తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందనీ, ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన రైతులు తమ భూములపై పూర్తి హక్కులు (ఫ్రీ హోల్డ్) పొంది, క్రయవిక్రయాలు జరుపుకోవడానికి వీలు కల్పించబడిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, తిరుపాలు, చిన్న స్వామి, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములు, స్వాములు, శివన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News