ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ధోబి ఘాట్ శిథిలమైనందుకు మరలా పునర్మాణం కొరకు రజక సంఘాలు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి విన్నవించగా తక్షణమే స్పందించి మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించి జనరల్ ఫండ్ క్రింద 3.5 లక్షలు మంజూరు చేసి ఉన్నారు. ధోబి ఘాట్ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, పట్టణ టిడిపి అధ్యక్షులు వేణుగోపాల్, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఎంఏ. రషీద్ లతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ కుల వృత్తులతో కొనసాగే రజక కుటుంబాలను అభివృద్ధి పరిచయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డ్ ఇంచార్జ్ ఎం.రమణ, మున్సిపల్ ఏఈ షాహీర్, కాంట్రాక్టర్ ఉపేంద్ర రెడ్డి, రజక సంఘం నాయకులు సాంబశివుడు, శివ కేశవ, శ్రీనివాసులు, బాదర్ల, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News