ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఢిల్లీలోని, ఇందిరా భవన్ సమీపంలో నేషనల్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కాలంబ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహాన్ నేతృత్వంతో నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, పెద్ద ఎత్తున భారత దేశం అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, జిల్లా- సిటీ ప్రెసిడెంట్స్ లతో, పెద్ద ఎత్తున మహిళలతో కలిసి 33 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనీ, ఈరోజే చేయాలనీ, ఇప్పుడే చేయాలనీ పోస్టర్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "మహిళా రక్షణ్ బిల్ లఘు కరో- ఆజ్ కరో అభి కరో" అనే వాదనతో నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ను అమలు చేయడంలో మహిళలకు ఖూనీ చేస్తున్నారని, మహిళలందరూ ఎరుపు వస్త్రాలతో అనేక రాష్ట్ర భాషల్లో నరేంద్ర మోడీ చెవులు చిల్లులు పడేవిధంగా ధర్నా చేపట్టడం జరిగింది. మరొక్కసారి నారీ శక్తి అంటే నరేంద్ర మోడీ కి భయం పుట్టి అడ్డుపడే ప్రయత్నాలు చేసిన జంతర్ -మంతర్ దగ్గరకి వెళ్లడానికి పోలీసులు అడ్డుకున్న కూడా, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని జిల్లాల మహిళా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు నంద్యాల జిల్లా నుండి నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్ బేగం కూడా పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News