ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో-2026 కార్యక్రమంలో వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ పాల్గొని, 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణమే మన లక్ష్యం. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సింగపూర్ దేశం నుండి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేష్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం సమాజ భవిష్యత్తుకు పునాది ఈ పోలే చుక్కలన్నారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రుడు తమ పిల్లలకు తప్పనిసరిగా రెండు రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News