ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణములోని, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో టిడిపి యూత్ నాయకుల ఆధ్వర్యంలో సిరి నగర్, ముజఫర్ నగర్కు చెందిన టీడీపీ యూత్ నాయకులు నాగార్జున, వేణు, శిక్ష మాలిక్, రంగా, ఉస్మాన్, నవీన్ తదితరులు తమ మిత్రులతో కలిసి ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని కి న్యాయవాదులు రాజేష్, జయసింహతో పాటు నాగార్జున వారి మిత్రులు శాలువా కప్పి, పూలమాలలు మెడలో వేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు, సిరి నగర్, ముజఫర్ నగర్ టిడిపి యువ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని సేవలను ప్రశంసిస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని టిడిపి యూత్ నాయకులకు, న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
E Nivas News