Thursday, 30 July 2026 01:19:19 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అందరికీ ఆదర్శప్రాయుడు స్వాతంత్ర సమరయోధుడు, దళిత ముఖ్యమంత్రి దామోదరం.సంజీవయ్య

ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 14 February 2026 10:01 PM Views : 185

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, నంద్యాల చెక్ పోస్ట్ సెంటర్ లో దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం.సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జాయింట్ కలెక్టర్ నూర్ అహమ్మద్, ఏపీ.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మరియు సాంఘిక సంక్షేమ శాఖ డి.డి- రాధిక పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ దామోదరం సంజీవయ్య గురించి వక్తలు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ స్వర్గీయ దామోదరం.సంజీవయ్య నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి ఫిబ్రవరి-14, 1921న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో జన్మించడం జరిగింది. అలాగే మే 8,1972 వ తేది మరణించడం జరిగింది.అని 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసి, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు మరియు తొలి దళిత అధ్యక్షుడు, సంయుక్త మద్రాసు, ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లో అనేకసార్లు మంత్రిగా పనిచేశాడు.1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్య కృషి పారిశ్రామి కాభివృద్ధికి తెలుగు భాష వాడుకను పెంచాడు, భూసంస్కరణలు అమలు చేశాడు. గాజులదిన్నె,వరదరాజుల స్వామి ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమకు సాగునీరు అందించాడు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, గనుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు బాగా స్వాములు కావాలని సూచించారు. కర్నూలు జిల్లాకు స్వర్గీయ దామోదరం.సంజీవయ్య పేరు పెట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, దళిత నాయకులు, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: