ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, నంద్యాల చెక్ పోస్ట్ సెంటర్ లో దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం.సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జాయింట్ కలెక్టర్ నూర్ అహమ్మద్, ఏపీ.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మరియు సాంఘిక సంక్షేమ శాఖ డి.డి- రాధిక పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ దామోదరం సంజీవయ్య గురించి వక్తలు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ స్వర్గీయ దామోదరం.సంజీవయ్య నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి ఫిబ్రవరి-14, 1921న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో జన్మించడం జరిగింది. అలాగే మే 8,1972 వ తేది మరణించడం జరిగింది.అని 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసి, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు మరియు తొలి దళిత అధ్యక్షుడు, సంయుక్త మద్రాసు, ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో అనేకసార్లు మంత్రిగా పనిచేశాడు.1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్య కృషి పారిశ్రామి కాభివృద్ధికి తెలుగు భాష వాడుకను పెంచాడు, భూసంస్కరణలు అమలు చేశాడు. గాజులదిన్నె,వరదరాజుల స్వామి ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమకు సాగునీరు అందించాడు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, గనుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు బాగా స్వాములు కావాలని సూచించారు. కర్నూలు జిల్లాకు స్వర్గీయ దామోదరం.సంజీవయ్య పేరు పెట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, దళిత నాయకులు, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News