ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : మంగళవారం నాడు నందికొట్కూరు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు, ఐఎఫ్టియు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, అఖిల భారత కిసాన్ రాష్ట్ర నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, తదితర నాయకులతో కలిసి గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుకరణ ఆపాలని కనీస వేతనం 30,000 చెల్లించాలని అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం వర్కర్లకు, మున్సిపల్, వర్కర్స్ తదితర స్క్రీన్ వర్క్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ముఠా ఆటో బిల్డింగ్ తోపుడు బండ్లు అసంఘటితరంగా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, విద్యుత్తు సవరణ, విత్తనాల సవరణ బిల్లును రద్దు చేయాలి రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు గుర్తింపు కార్డులకు రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను రద్దు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, 200 రోజులు పని దినాలు కల్పించి, 7 వందలు కూలి ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని, ఈపీఎస్ఎఫ్ పెన్షన్ సౌకర్యం 9 వేల రూపాయలు మినిమం ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ టైం స్కేల్ తదితర ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో ఆ దేశ ఒప్పందంలో భాగంగా మన పంటలు నష్టం జరిగే విధంగా మొక్కజొన్న తదితర పంటలను విదేశాల నుండి దిగుమతి తీసుకోవడం వలన మన దేశ రైతులు దివాలా తీసే పరిస్థితి అన్నారు. తక్షణమే అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెను చేపట్టడం జరుగుతుందని కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టు యు నాయకులు వెంకటరమణ, కురుమన్న, శ్యామ్, హనుమంతు, ఏఐసీసీటుయు నాయకులు లింగాల శ్రీనివాసులు, ప్రసాద్, ప్రగతిశీల మహిళ సంఘం నాయకులు ఎస్.బిబి, చూరీబి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News