ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజవర్గంలోని, అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నందికొట్కూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ విధివిధానాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద రెడ్డి, సొసైటీ చైర్మన్ హరి సర్వోత్తమ్ రెడ్డి, సత్యం రెడ్డి మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News